‘ప్రస్థానం’ దర్శకుడితో మెగా హీరో

341
Sai Dharam Tej.jpeg
- Advertisement -

వరుస ఫెయిల్యూర్ లతో సతమతమవుతున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో  భారీ విజయాన్ని అందుకున్నాడు.  ప్రస్తుతం ఆయన మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఇటివలే ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్ధానం సినిమాతో టాలీవుడ్ లో సంచలన సృష్టించిన దర్శకుడు దేవా కట్ట తో తేజ్ సినిమా చేయనున్నాడు.

ప్రస్తుతం ఆయన సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ‘ప్రస్థానం’ హిందీ రీమేక్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా పూర్తయ్యాక తెలుగులో తేజ్ తో సినిమా చేయనున్నాడట. తాజా సమాచారం ప్రకారం దేవ కట్టా చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో తేజ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత దేవా కట్ట తెలుగులో సినిమా తీస్తుడండటంతో మరీ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి.

- Advertisement -