థియేటర్లో సందడి చేసిన ‘మీకు మాత్రమే చెప్తా’ టీం

356
Meeku matrame Chepta
- Advertisement -

తరుణ్‌ భాస్కర్‌ హీరోగా షామీర్ సుల్తాన్‌ దర్శకత్వంలో కింగ్ ఆఫ్ హిల్స్ పతాకంపై విజయ్‌ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’ ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి థియేటర్స్ ని నవ్వుల వాన లో నింపుతున్నాయి. తమ ప్రయత్నానికి ఇంత ‘‘ ఫన్ స్టాస్టిక్ హిట్’’అందించిన ప్రేక్షకులను కలసి థ్యాంక్స్ చెప్పేందకు టీం థియేటర్స్ ని విజిట్ చేసింది. హోెరెత్తుతున్న నవ్వుల ను నిశ్శబ్దంగా విన్న తరుణ్ భాస్కర్, అభినవ గోమటం, అవంతికశర్మ, పావని గంగిరెడ్డి ప్రేక్షకుల స్పందన వారికి గొప్ప అనుభూతలను నిచ్చింది.

ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ : ‘‘ నిజాయితీగా చేసిన మా ప్రయత్నానికి ిప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన మాకు గొప్ప థైర్యాన్నిచ్చింది. ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులకు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరితో కలసి కొన్ని సన్నివేశాలను చూడటం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వారి అభిమానం పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.అన్ని క్లాస్ఆడియన్స్ కి మేము రీచ్ అయ్యాం అని
తెలుస్తుంది. ప్రేక్షకులు పెద్ద ధ్యాంక్స్’’ అన్నారు.

అభినవ గోమటం: ‘‘ మా సినిమా ని ఇంతలా ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులను చూస్తే నాకు మాటలు రావడం లేదు.. ప్రేక్షకుడిగా చాలా సినిమాలు గోల చేస్తూ చూసాను కానీ నేను నటించిన సినిమా కు ప్రేక్షకుల చేస్తున్న గోల ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రేక్షకులు ఎంటర్ టైన్మెంట్ ని ఎంతగా కోరుకుంటున్నారో ఈ ఆదరణ చూస్తే తెలుస్తుంది.. మా రౌడి బాయ్స్ , గళ్స్ కు చాలా థ్యాంక్స్ ప్రేక్షకులను ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.

అవంతికశర్మ మాట్లాడుతూ: ‘‘ అద్భుతమైన స్పందన చూసాము.. సినిమా గురించి విన్న దానికి,నేరుగా ప్రేక్షకుల స్పందన చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈసినిమా లో భాగం అవడం నా అదృష్టం ’’ అన్నారు.

- Advertisement -