ఉద్యమ స్ఫూర్తితో పల్లె పగ్రతిః మేడ్చల్ కలెక్టర్

484
mv reddy
- Advertisement -

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు కలెక్టర్ ఎంవీ రెడ్డి. ఈసందర్భంగా కలెక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏర్పడ్డ మూడు సంవత్సరాల నాలుగు నెలల్లోనే ఎన్నో మైలురాళ్లు దాటిందన్నారు. త్వరలోనే అంతాయిపల్లి నూతన కలెక్టరేట్ కు మారనున్నట్లు తెలిపారు. కీసర అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం పార్క్ గా అభివృద్ధి చేసేందుకు ఎంపీ సంతోష్ కుమార్ కేటాయించిన రూ. 2.57 కోట్ల నిధులతో పనులు చేపట్టామన్నారు.

పల్లెప్రగతి కార్యక్రమాన్ని రెండు విడతలుగా ఉద్యమ స్పూర్తితో విజయవంతం చేసినట్లు తెలిపారు. ఈచ్ వన్ – టీచ్ వన్ నినాదంతో జరుగుతున్న రెండో విడత పల్లె ప్రగతిలో గుర్తించిన వయోజన నిర్లక్ష్యరాస్యులను 6 నెలల్లో అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో అమలు చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించినందుకు స్టేట్ డెమోక్రసీ అవార్డు పొందడం సంతోషకరంగా ఉందన్నారు.

- Advertisement -