రేవంత్‌ రెడ్డిపై కాంగ్రెస్ నేతల మండిపాటు..

351
revanth reddy
- Advertisement -

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల మధ్య కుమ్ములాటలు తారాస్ధాయికి చేరాయి. కాంగ్రెస్ బీ ఫామ్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మేడ్చల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు. మేడ్చల్ పరిధిలోని 21 వార్డులో సీనియర్ నేత పానుగంటి సత్తయ్యకు బీ ఫామ్ ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు స్ధానిక నేతలు.

అయితే రేవంత్ రెడ్డి …తనను అడ్డుకున్న మహిళను కాలితో తన్ని వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాధితురాలు రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కూడా తన తండ్రికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించింది. టికెట్ ఇవ్వకుంటే సూసైడ్ చేసుకుంటానని ఆమె కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో దళితులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు

- Advertisement -