మహేష్‌ కోసం ఏకంగా కొండారెడ్డి బురుజును దింపేశారు..!

698
sarileru neekevvaru
- Advertisement -

భరత్ అను నేను, మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో జోష్‌ మీదున్నారు హీరో మహేష్. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా షూటింగ్ జరుపుకుంటుండగా షెడ్యూల్ బ్రేక్స్ కూడా లేకుండా లాగించేస్తున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. సినిమా కోసం పెద్ద సెట్‌లను వేశారట. నిర్మాతలు సైతం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెడుతున్నారు. సరిలేరు నీకెవ్వరు కోసం ఏకంగా కర్నూల్ కొండారెడ్డి బురుజు సెట్ వేసేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కొండారెడ్డి బురుజు సెంటర్‌తో పాటు ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ వేశాడట. ఇందులో ఒకటి ట్రైన్ సెట్ కాగా మరొకటి హౌజ్ సెట్‌. రామోజీ ఫిల్మ్‌సిటీలో కొండారెడ్డి బురుజు సెట్ వేయగా ఇందుకోసం దాదాపు రూ. 4.5 కోట్లను ఖర్చుచేశారు. ఇక అన్నపూర్ణ స్టూడియోలో ట్రైన్ సెట్ వేయగా ఇందుకోసం రూ. 4 కోట్లు ఖర్చుచేశారని టాక్.

ఇక సరిలేరు నీకెవ్వరు కోసం హైదరాబాద్ శివారులో ఏకంగా 30 ఎకరాల్లో ఇంటి సెట్‌ని వేశారు .ఇప్పటివరకు దాదాపు 70 శాతం సినిమా షూటింగ్ పూర్తైంది. 14 రీల్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తుండగా మహేష్ సరసన గీతా గోవిందం ఫేమ్ రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించింది.

- Advertisement -