మార్చి 15న ‘మనసా వాచా’..

208
Manasa Vacha
- Advertisement -

గణేష్ క్రియేషన్స్ పతాకంపై.. యువ ప్రతిభాశాలి ఎం.వి. ప్రసాద్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తేజస్-కరిష్మా కర్పాల్-సీమా పర్మార్ హీరోహీరోయిన్స్ గా నిశ్చల్ దేవా-లండన్ గణేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమ కథా చిత్రం ‘మనసా.. వాచా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘ఎం.జి.ఎం (మినిమమ్ గ్యారంటీ మూవీస్) ద్వారా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

హీరో టర్నడ్ ప్రొడ్యూసర్ నిశ్చల్ దేవా మాట్లాడుతూ.. ‘లైఫ్ స్టైల్, తులసిదళం’ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన నేను.. కథ నచ్చడంతో ఈ సినిమాతో నిర్మాతగా మారాను. దర్శకుడు ఎం.వి.ప్రసాద్ ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు. సినిమా మొత్తం లండన్ లో తీశాం.. అన్నారు.

Manasa Vacha

దర్శకుడు ఎం.వి.ప్రసాద్ మాట్లాడుతూ.. ‘జ్వరం, జలుబు వంటి వ్యాధులు వచ్చినప్పుడు ఎలా అయితే మందులు వేసుకుని.. ఆ వ్యాధులు నయం చేసుకుంటామో.. క్యాన్సర్ సోకినప్పుడు కూడా అంతే సులభంగా నయం చేసుకునేలా ఉండాలనే లక్ష్యంతో పని చేసే ప్రేమికులకు ఎదురయ్యే కొన్ని అనూహ్య సంఘటనల సమాహారంగా ‘మనసా.. వాచా’ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రం ద్వారా వచ్చే లాభాల్లో సగం కాన్సర్ వ్యాధికి ఉచితంగా వైద్యం అందించే సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాం..’ అన్నారు.

ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ‘ఎం.జి.ఎం’ అధినేత అచ్చిబాబు మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత మంచి సినిమా మా ఎం.జి.ఎం ద్వారా విడుదలవుతుండడం సంతోషంగా ఉంది. మార్చి 15న వీలైనన్ని ధియేటర్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు!!

- Advertisement -