దసరా వెకేషన్‌కి మహేష్..!

727
- Advertisement -

భరత్ అనే నేను,మహర్షి వంటి బ్యాక్ టు బ్యాక్‌ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ ….అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు షూటింగ్ ఖాళీ సమయంలో ఫారన్ ట్రిప్‌కు వెళ్లడం మహేష్‌కి అలవాటే. ఈ నేపథ్యంలో దసరా వెకేషన్‌కి ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కి వెళ్లారు. ఈ న్యూస్‌ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది మహేష్ భార్య నమ్రతా. దసరా హాలీడేస్‌ని ఎంజాయ్ చేయడానికి వెళుతున్నామని…త్వరలో కలుద్దాం అంటూ పేర్కొంది.

మహేష్ ఆర్మీ మేజర్‌గా ఈ మూవీలో నటిస్తుండగా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తైంది. ఈ మూవీతో సీనియర్ నటి విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండగా నిర్మాత బండ్ల గణేష్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడు.

mahesh babu

- Advertisement -