మహేష్‌ ‘మహర్షి’కి భారీ డిమాండ్..!

263
- Advertisement -

మహేశ్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్స్‌గా నటిస్తోన్న చిత్రం ‘మహర్షి’ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా విదేశాల్లోనే ఎక్కువభాగం చిత్రీకరణను జరుపుకుంటోంది. మహేశ్ కి ఇది 25వ సినిమా కావడంతో, అభిమానుల్లో అంచనాలు భారీగా వుండే అవకాశం వుంది. అందువలన వంశీ పైడిపల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

Mahesh' Maharshi

మహేష్‌ మూవీ కావడంతో శాటిలైట్ హక్కులకు గట్టిపోటీ ఏర్పడింది. భారీ రేటు చెల్లించి శాటిలైట్ హక్కులను జెమినీ టీవీవారు సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని వాళ్లు అధికారికంగా ధృవీకరించారు. అల్లరి నరేశ్ ముఖ్యమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల కానుంది.

 

- Advertisement -