ఇంగ్లాండ్ కప్ గెలిస్తే..కివీస్ ప్రజల హృదయాలు గెలిచిందిః మహేశ్ బాబు

346
Mahesh Babu On World Cup
- Advertisement -

వరల్డ్ కప్ ఫైనల్లో బౌండరీ కట్ రూల్ ప్రకారం ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఐసీసీ పెట్టిన ఈ రూల్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సామన్య ప్రజలే కాకుండా పలువురు ప్రముఖులు, మాజీ క్రికెటర్లు కూడా ఈరూల్ పై విమర్శలు చేస్తున్నారు.

ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయని మ్యాచ్ టై అయినప్పుడు ఒకరికే కప్ ఎలా ఇస్తారంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ఐసీసీని ప్రశ్నిస్తున్నారు. తాజాగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై స్పందించారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించాయన్నారు.

ఫైనల్ గా ఇంగ్లాండ్ కప్ గెలిచిందనన్నారు. కానీ న్యూజిలాండ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలను గెలిచిందన్నారు. మహేశ్ బాబు చేసిన ఈట్వీట్ కు చాలా మంది మద్దతు తెలపగా..ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -