దీపావళీ ట్రీట్…విలన్ ను ఖతం చేసిన మహేశ్ బాబు

196
mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈసినిమాలో మహేశ్ బాబు సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మహర్షి సినిమా తరువాత మహేష్‌, బ్లాక్‌ బస్టర్‌ ఎఫ్‌ 2 తరువాత అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కావటంతో సరిలేరు నీకెవ్వరుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. జనవరి 12న సినిమా రిలీజ్‌ అంటూ అధికారిక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా విలన్‌ ఇంటికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో వెల్లడించాడు.

‘‘విలన్ ఇంటికి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. 2020 సంక్రాంతి సూపర్ ఫన్‌గా ఉండబోతోంది. ఫైనల్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాము. సరిలేరు నీకెవ్వరు దీవాళి ట్రీట్‌కు సిద్ధంగా ఉండండి’’ అని ట్వీట్ చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈమూవీకి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -