కేజీఎఫ్ దర్శకుడితో మహేశ్..నిర్మాతగా అల్లు అరవింద్

450
Mahesh Babu Prashanth Nil
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈమూవీతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు మహేశ్. ఈమూవీ తర్వాత మహేశ్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇక మూవీ తర్వాత మహేశ్ ఎవరితో సినిమా చేస్తాడన్నదానిపై క్లారిటీ లేదు. తాజాగా ఉన్న సమాచారం మేరకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది.

ఈమూవీకి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రశాంత్ నీల్ ఇటివలే మహేశ్ కు కథ వినిపించారట. అది నచ్చడంతో మహేశ్ బాబు వెంటనే నిర్మాత అల్లు అరవింద్ ను కలవమని చెప్పాడట. ఇక ఈ స్టోరీ విని అరవింద్ ఒకే అంటే సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. మహేశ్ తో అల్లు అరవింద్ ఎప్పటినుంచో సినిమా చేద్దామనుకున్నాడు…అందుకోసమే మహేశ్ ప్రశాంత్ నీల్ ను అల్లు అరవింద్ వద్దకు పంపించాడని తెలుస్తుంది.

- Advertisement -