కాశ్మీర్ లో “సరిలేరు నీకెవ్వరు”

272
SArileru nikevaru
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మహేశ్ కెరీర్ లోనే ఈసినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక మహేశ్ తన తర్వాతి మూవీ అనిల్ రావిపూడితో చేయనున్నాడు. ఈమూవీకి సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈచిత్రం షూటింగ్ రేపటి నుంచి ప్రారంభంకానుంది.

మొదటి షెడ్యూల్ కాశ్మీర్ లో జరుగనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈమూవీలో రష్మీక మందన హీరోయిన్ గా నటించగా..సీనియర్ హీరోయిన్ , మాజీ ఎంపీ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈమూవీని 2020సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్.

ఈసినిమాలో మహేశ్ బాబు ఆర్మీ మేజర్ గా కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈసినిమా పూర్తయ్యాక మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు మహేశ్. గీత గోవిందం దర్శకుడు పరుశరాములుతో తర్వాతి సినిమా చేయనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్. ఈచిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించనున్నారు

- Advertisement -