బాహుబ‌లి రికార్డు బ్రేక్‌ చేసిన మహేష్ మూవీ..

459
mahesh
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఉగాది పర్వదినాన టెలివిజన్ ప్రీమియర్‌గా మార్చి 25న ప్రముఖ టీవీ చానెల్‌లో టెలికాస్ట్ చేశారు.

sarileru-neekevvaru

అయితే కరోనా ఎఫెక్ట్‌తో ఈ చిత్రం అత్యధిక టీఆర్పీని సొంతం చేసుకుని సంచలన రికార్డ్‌ను నమోదు చేసింది. బుల్లితెరపై ఇప్పటి వరకు ఉన్న బాహుబలి రికార్డ్‌ను కూడా ఈ చిత్రం బ్రేక్‌ చేయడం విశేషం. ఈ చిత్రం 23.4 టీవీఆర్ సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో బాహుబ‌లి2 చిత్రం 22.70 సాధించ‌గా, బాహుబ‌లి తొలి పార్ట్ 21.84 రేటింగ్ రాబ‌ట్టింది.

మ‌హేష్ చిత్రానికి ఈ రేంజ్‌లో రేటింగ్ రావ‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే త‌మ చిత్రంపై ఇంత ఆద‌ర‌ణ చూపించినందుకు చిత్ర నిర్మాత అనీల్ సుంక‌ర ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తూ, ఈ సారి మ‌రి కొన్ని సీన్స్ యాడ్ చేసి ప్ర‌సారం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -