గీతాగోవిందం దర్శకుడితో మహేష్ ’27’…?

447
mahesh parushram
- Advertisement -

భరత్ అను నేను,మహర్షి వరుస హిట్ సినిమాలతో జోష్ మీదున్న మహేష్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం తన 26వ సినిమాగా సరిలేరు నీకెవ్వరూ చేస్తున్న మహేష్ ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాను లైన్లో పెట్టాడు మహేష్‌.

గీత గోవిందం వంటి సూపర్ హిట్ సినిమాను తీసిన పరశురామ్ తో మహేష్ సినిమా ఫిక్స్ అయినట్టు సమాచారం. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఇక ప్రస్తుతం మహేష నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరూ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ కాశ్మీర్ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని హైదరాబాద్ లో షూటింగ్ కు రెడీ అవుతున్నది. రష్మిక హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో విజయశాంతి కీలక రోల్ ప్లే చేస్తున్నది. నవంబర్‌లో షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -