మహారాష్ట్రలో బీజేపీకి ఛాన్స్‌ ఇచ్చిన గవర్నర్..

435
cm fadnavis
- Advertisement -

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేయవలసిందిగా బీజేపీని కోరారు గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సంప్రదాయం కాబట్టి బీజేపీకి అవకాశం ఇచ్చామని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.

నవంబర్‌ 11 తేదీలోపు అసెంబ్లీలో బలాన్నీ నిరూపించుకోవాలని కోరారు. ఫలితాలు విడుదలై 15 రోజులకుపైగా గడుస్తున్నా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని విషయం తెలిసిందే. సీఎం పీఠం, పదవుల పంపకాలపై బీజేపీ-శివసేన కూటమి మధ్య ఏర్పడిన విభేదాలే దీనికి ప్రధాన కారణం.

ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -