రాజకీయమంటే ఇదే..ఫలించిన మోడీ మంత్రాంగం

722
pawar modi
- Advertisement -

రాజకీయమంటే ఇదే..రాత్రికి రాత్రే అంతా మారిపోవడంతో రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. దీంతో సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న శివసేనకు గట్టి షాక్ ఇచ్చిన బీజేపీ…. రాజకీయమంటే ఏంటో శివసేనకు తెలిసొచ్చేలా చేసింది.

మహారాష్ట్ర ప్రజలకు సుస్థిరమైన పాలన అందిస్తామని తెలిపారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడిన ఆయన ప్రజాతీర్పును శివసేన అవమానించిందన్నారు. పొత్తుల కోసం వెంపర్లాడిందని…ప్రజలు స్ధిరమైన ప్రభుత్వాన్ని కోరుకున్నారని..కిచిడీ ప్రభుత్వాన్ని కాదన్నారు. బీజేపీకే ప్రజలు మెజార్టీని కట్టబెట్టారని చెప్పారు. సుస్ధిర పాలన కోసమే ఎన్సీపీ తమకు మద్దతిచ్చిందన్నారు. అసెంబ్లీలో కావాల్సిన మెజార్టీ తమకుందన్నారు.

మహారాష్ట్రలో రైతు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. రైతు సమస్యల కోసమే బీజేపీకి మద్దతిచ్చామని…ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేదన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం జరిగిందని…సుస్ధిర పాలన కోసమే బీజేపీకి మద్దతిచ్చామని వెల్లడించారు.

మహాసీఎంగా ఉద్దవ్ ఠాక్రేను ప్రకటించిన గంటల్లోనే రాజకీయాలు మారిపోయాయి. ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా రాష్ట్రపతి పాలన ఎత్తేశారు గవర్నర్. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్‌ పవార్‌లకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,బీజేపీ చీఫ్ అమిత్ షా.

రెండు రోజుల క్రితం ప్రధాని మోడీతో శరద్ పవార్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్న సంగతి తెలిసిందే. కేవలం రైతు సమస్యలపై మాత్రమే ప్రధానిని కలిశారని పవార్ చెప్పారు. అయితే అక్కడే బీజేపీ – ఎన్సీపీ కూటమికి బీజం పడినట్లు తెలుస్తోంది.

Devendra Fadnavis was sworn in on Saturday morning as the chief minister of Maharashtra: a stunning development that came as the nation expected an alliance excluding the BJP

- Advertisement -