అదిరిందయ్యా …కళ్యాణ్ బాబు:మాధవీలత

400
madhavi latha
- Advertisement -

ఏపీలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. జనసేన – బీజేపీ మధ్య పొత్తు కుదరగా..ఆంధ్రప్రదేశ్ భవిష్యతో కోసమే బీజేపీతో కలిశామని వెల్లడించారు పవన్‌.

జనసేన-బీజేపీ పొత్తు ఇరు పార్టీల కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలత ఆసక్తికర కామెంట్స్ చేశారు. పవన్ రాకకోసం 18 నెలలుగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. పవన్ బీజేపీకి మద్దతివ్వడం ఆనందంగా ఉందని చెప్పారు.

చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తాను బీజేపీలో చేరినప్పుడు నన్ను హేట్ చేశారు. ఇప్పుడు చూడండి.. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ-జనసేన కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చిందన్నారు. లేట్ అయినా లేటెస్ట్ డెసిషన్. అదిరిందయ్యా కళ్యాణ్ బాబూ అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేసింది మాధవీలత.

- Advertisement -