లిక్కర్‌ పోటీలో లక్కు ఎవరిదో..!

460
Lucky Draw For Liquor
- Advertisement -

నేడు (శుక్రవారం) రాష్ట్రంలో మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు.ఈ లక్కీ డ్రా ద్వారా 2,216 షాపులకు యజమానులను ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం అన్నిజిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 2,216 దుకాణాలకు 48,401 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. గతేడాది కంటే దరఖాస్తుల సంఖ్య పెరిగిందన్నారు. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలకు పెంచినప్పటికీ మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి.

Liquor

మద్యం షాపుల ఎంపిక కోసం 34 కేంద్రాల్లో లక్కీ డ్రా తీసేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ లక్కీ డ్రా తీయనున్నట్లు ఆయన తెలిపారు. ఇక నవంబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు.

నిజామాబాద్ జిల్లాలో ఐదు అంతకంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన మద్యం షాపులకు డ్రా నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మూడు, ఆర్మూర్ పరిధిలో మూడు, నిజామాబాద్ పరిధిలోని రెండు షాపుల డ్రాను నిలిపివేయనున్నారు. వ్యాపారులు సిండికేటుకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

- Advertisement -