లాక్‌డౌన్ స‌త్ఫ‌లితం ఇస్తోంది: కేంద్ర ఆరోగ్య శాఖ‌

266
india corona
- Advertisement -

లాక్ డౌన్ స‌త్ఫ‌లితాన్ని ఇస్తోంద‌ని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ‌. దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య 694కి చేరింద‌ని గురువారం ఒక్క రోజే 88 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు న‌మోద‌య‌య్యాయ‌ని తెలిపింది. కొరోన నుండి 45 మంది బాధితులు కోలుకున్నార‌ని వెల్ల‌డించింది.

ఇక క‌రోనా పాజిటివ్ కేసుల్లో చైనాను దాటేసింది అమెరికా. నిన్న ఒక్క‌రోజే 19 వేల‌కి పైగా కేసులు న‌మోద‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో కోవిడ్‌19 నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు ప్రొటెక్టివ్ సూట్‌లు కావాల‌ని అమెరికాలో న‌ర్సులు ఆందోళ‌న చేస్తున్నారు.

నర్సుల‌కు అనేక మంది సంఘీభావం తెలిపారు. వ్య‌క్తిగ‌త సూట్లు లేనంత వ‌ర‌కు వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డం క‌ష్ట‌మే అని న‌ర్సులు అంటున్నారు. క‌రోనా సంక్ర‌మించిన వారి సంఖ్య ప్ర‌పంచ వ్యాప్తంగా 5 ల‌క్ష‌లు దాటింది.

- Advertisement -