మాస్కులు పంపిణీ చేసిన లింగపల్లి కిషన్‌రావు..

424
Kishan Rao
- Advertisement -

కరోనా నేపథ్యంలో పలువురు తమకు తోచిన విధంగా ప్రజలనకు సహాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ లీడర్ లింగపల్లి కిషన్‌రావు తెలంగాణ భవన్‌ సిబ్భంది సెక్యూరిటీ మిత్రులకి మరియు పోలీసు మిత్రులకు మాస్కులు, శానిటైజర్ బాటిల్ లు, అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ భవన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.

Lingampally Kishan Rao

తెలంగాణ భవన్‌లో నేను ఈరోజు… అక్కడ అడుగు పెడితే చాలు ఆ అనుభూతే వేరు, ఆనందమే వేరు.. ఆనందంగా అమ్మానాన్నతో గడిపినట్టు, కుటుంబ సభ్యులందరితో సహపంక్తి భోజనం చేసినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరితో కలిసి మెలిసి ఉన్నట్లు, అవధులు లేని ఆనందం పొందినట్లు ఉంటుంది. అని కిషన్‌రావు అన్నారు.

Lingampally Kishan Rao TRS

- Advertisement -