తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు నేర్పర్చుకున్నారు కమెడియన్ పృథ్వి, తెలుగు సినీ పరిశ్రమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పరిచయం అయ్యారు. తన డైలాగులతో ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తుంటాడు పృథ్వీ. ఓ ఇంటర్వూలో పాల్గొన్న పృథ్వీ నాకు తెలుగు ముఖ్యమంత్రులలో నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను చాల అభిమానిస్తాన్నారు పృథ్వీ. నందమూరి తారకరామారావు గారు అత్యుత్తమ నిజాయతీ గల ముఖ్యమంత్రి అని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మడమతిప్పని మహావ్యక్తి అని, తెలుగువాడి వాడీవేడీ చూపించిన ముఖ్యమంత్రులు వీళ్లిద్దరూ. ది రియల్ ముఖ్యమంత్రులన్నారు.
అలాగే నాకు రాజకీయాలంటే కొంచం ఆసక్తి ఎక్కువన్నారు. పోసాని గారిని అన్నయ్య అనాలో, తమ్ముడు అనాలో గానీ. ఆయనకు రాజకీయాలంటే మహా ఆసక్తి అన్నారు . కానీ మేము వ్యక్తిగతంలో ఎవరిపైనా నోరుపారేసుకోం ఇంట్లో అయినా, బయట అయినా మేము ఉన్నదిఉన్నట్టుగానే మాట్లాడతామన్నారు.ఎవరైనా కొట్టారనుకోండి, కొట్టించుకుంటాం. మేం కొట్టే స్థితిలో ఉంటే కొడతాం. పదిమందిని తీసుకొచ్చి కొట్టారనుకోండి కొట్టించుకుంటాం.. మేం పది మందిని తీసుకెళ్లి కొట్టే స్థితి వచ్చినప్పుడు కొడతాం.. అది నా సిద్ధాంతం. ప్రజల మధ్య నిరంతం ఉండి సమస్యల గురించి పోరాడే నేతలంటే చాలా ఇష్టం. జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ గారు..ఇలా ఎవరైనా’ అని చెప్పుకొచ్చారు.