టీఆర్ఎస్‌ కార్యాలయాలు..ఎవరెవరు ఎక్కడంటే

450
trs offices
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో ఇవాళ అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల భూమి పూజ కార్యక్రమం పండగలా సాగింది. మంత్రులు,జడ్పీ ఛైర్మన్లు ఆయా జిల్లాల్లో పార్టీ ఆఫీసులకు శంకుస్ధాపన చేశారు.

సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ వద్ద టీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ భూమి పూజ చేశారు. సూర్యాపేట లో జిల్లా పార్టీ కార్యాలయంకు మంత్రి జగదీష్ రెడ్డి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య భూమి పూజ చేయగా, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి ,హాజరైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు , ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , ఎమ్మెల్యే రేగా కాంతారావు మాజీ జడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ ఛైర్మన్ వాసుదేవరావు ,మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు పాల్గొన్నారు.

బాలసముద్రంలో వరంగల్ అర్బన్ టీఆరెస్ జిల్లా కార్యాలయ నిర్మాణానికి జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, అరురి రమేష్, నన్నపునేని నరేందర్, మేయర్ ప్రకాష్ రావు, కుడా చైర్మన్ మర్రి యదవరెడ్డి, కార్పొరేషన్ ఛైర్మెన్ లు నాగుర్ల వెంకటేశ్వర్లు, కిషన్ రావు పాల్గొన్నారు.

ములుగు జిల్లా:కేంద్రంలోని బండారుపల్లి శివారులో టిఆర్ఎస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయానికి భూమి పూజ శంకుస్థాపన చేశారు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జలవనరుల చైర్మన్ వి ప్రకాష్, మాజీ మంత్రి అజ్మీర చందూలాల్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి పాల్గొన్నారు.

కామారెడ్డి:- జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలో టిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయంకు భూమి పూజ చేశారు జిల్లా పరిషత్ చైర్మన్ ధపెదార్ శోభ. ఎమ్మెల్యేలు గంపగోవర్ధన్, హన్మంత్ షిండే, బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి పోచారం భాస్కర్ రెడ్డి,డీసీఎంఎస్ చైర్మన్ ముజీ బ్‌తో పాటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో టీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంకు శంకుస్థాపన చేశారు జడ్పీ చైర్మన్ మంజు శ్రీ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, మనిక్ రావు, ఎమ్మెల్సీ ఫరూరుద్దీన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్,మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ పాల్గొన్నారు.

సిద్ధిపేట జిల్లా సిద్దిపేట పొన్నాల గ్రామ శివారులో TRS పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు,జిల్లా పరిషత్ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ,ఎమ్మెల్యే సతీష్ కుమార్,ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్,రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మెన్ లు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,గ్యాదరి బాలమల్లు,భూపతి రెడ్డి,భూంరెడ్డి, సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, జిల్లా ముఖ్యనేతలు పాల్గొన్నారు.

- Advertisement -