నేను టీడీపీకి వ్యతిరేకం కాదు చంద్రబాబుకి మాత్రమే..!

286
Lakshmi Parvathi
- Advertisement -

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జయంతి వేడుకలపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి అసహనం వ్యక్తం చేశారు. కనీసం ఆయన ఘట్‌ను కూడా అలంకరించరా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేడు ఎన్టీఆర్ జయంతి కాగా, హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కనీస అలంకరణలేక బోసిపోయింది. ప్రతి సంవత్సరమూ ఎన్టీఆర్ జయంతి నాటికి ఘాట్ ను ఎంతో అందంగా అలంకరిస్తారన్న సంగతి తెలిసిందే. పలురకాల పూలు తెచ్చి, ఎన్టీఆర్ స్మారకాన్ని తీర్చిదిద్దుతారు. ఈ సంవత్సరం మాత్రం ఘాట్‌ను అలాగే వదిలేశారు. కనీసం పెచ్చులూడిన భాగాలకు మరమ్మతులు కూడా చేయలేదు.

NTR

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి తన భర్తకు నివాళులు అర్పించిన లక్ష్మీపార్వతి, ఘాట్ వద్ద ఏర్పాట్లపై మండిపడ్డారు. ఎంతో పవిత్రంగా చూడాల్సిన ప్రదేశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఇలా గాలికి వదిలేశారని, కనీస అలంకరణ కూడా లేకపోయిందని కంటతడి పెట్టారు. ఎన్టీఆర్ జయంతిని సూచిస్తూ, ఒక్క బ్యానర్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు చేసిన అన్యాయాలు, కుట్రలకు తగిన శాస్తి జరిగిందని, ప్రజలే ఆయనకు బుద్ధి చెప్పారని మండిపడ్డారు. తాను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాదని, చంద్రబాబు అనే పేరున్న వ్యక్తికి మాత్రమే వ్యతిరేకమని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.

Jr NTR

ఇదే విషయంపై జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఘాట్ పై పుష్పాలంకరణను వెంటనే ఏర్పాటు చేయాలని అక్కడే ఉన్న కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసిన ఎన్టీఆర్, తన సోదరుడితో కలిసి అక్కడే కూర్చున్నారు. సమాధి అలంకరణ పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు. ఆపై తాతయ్యను అందరూ వదిలేశారని, ఇకపై తాతయ్య జయంతి, వర్థంతి వేడుకలను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి వెళ్లిపోయారు.

- Advertisement -