హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక.. కేటీఆర్‌ ధన్యవాదాలు..

550
ktr
- Advertisement -

హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్‌ ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి దాదాపుగా 82 శాతం ఓటింగ్ జరగడంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఓటింగ్ లో పాల్గొన్న హుజూర్‌నగర్ ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు కోసం గత నెల రోజులుగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. వారందరికీ నా ధన్యవాదాలు అని కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

పార్టీ శ్రేణుల నుండి అందిన సమాచరం ప్రకారం భారీ మెజారిటీతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు ఖాయమని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, అధికారులు, సిబ్బందికి మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.

- Advertisement -