గజ్వేల్‌లో కేటీఆర్‌…సెల్ఫీలు దిగేందుకు పోటీ

521
ktr slefie
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి అందరిని ఆకట్టుకున్నారు. ఓ సాధారణ పౌరుడిలా వ్యవహరించి ప్రజల మనసు గెలుచుకున్నారు. సిరిసిల్ల పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు బయలుదేరిన కేటీఆర్ మార్గం మధ్యలో కాసేపు గజ్వేల్‌లో ఆగారు. ఓ హోటల్‌లో చాయ్‌ తాగారు. స్ధానికులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ని చూసేందుకు స్ధానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. రామన్నతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. వారందరితో సెల్ఫీలు దిగిన కేటీఆర్ వారిలో ఉత్సాహం నింపారు. కేటీఆర్‌తో సెల్ఫీలు దిగడంపై ఆనందం వ్యక్తం చేశారు స్ధానిక యువకులు.

KTR2

కేటీఆర్‌తో పాటు టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. కేటీఆర్‌ తన హోటల్‌కి రావడంపై రాధిక హోటల్‌ నిర్వాహకుడు అనిల్‌ సంతోషం వ్యక్తంచేశారు.

- Advertisement -