చెత్తకుప్పలో కాంగ్రెస్‌…కేటీఆర్‌ ఫైర్‌

237
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి అడ్డుతగులుతు మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌పై కాంగ్రెస్ సభ్యులు దాడిచేయడంపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. స్కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరును చూసి విసిగిపోయి ప్రజలు ఆ పార్టీని చెత్తకుప్పలో వేశారని ఎద్దేవా చేశారు. రౌడియిజానికి దిగిన ఎవరైనా మట్టికరువత తప్పదని దుయ్యబట్టారు.

ktr

అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు సబ్జెక్ట్ లేకవపోవడంతోనే ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డారన్న కేటీఆర్‌..సభలో నిరసన తెలిపే నైతిక అధికారం కాంగ్రెస్ కు లేదని ట్వీట్టర్లో మండి పడ్డారు. కోమటిరెడ్డి హెడ్‌సెట్‌ విసిరేయడంతో స్వామిగౌడ్‌కు గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యలపై తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

 

- Advertisement -