పరిపూర్ణానంద వ్యాఖ్యలు హాస్యాస్పదం

232
ktr
- Advertisement -

బీజేపీ నేత పరిపూర్ణానంద వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. బీజేపీ చీఫ్‌ అమిత్‌షా ..టీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని అంటూ పగటి కలలు కంటున్నారన్నారని దుయ్యబట్టారు. సిరిసిల్ల జిల్లాలో ముస్లిం మైనార్టీలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన కేటీఆర్… స్వామి పరిపూర్ణానంద బీజేపీ నేత అవతారమెత్తి రాష్ట్రంలో 70 సీట్లు గెలుస్తామంటున్నారని, 70 సీట్లలో అభ్యర్థులే లేరని ఆయన అన్నారు. బీజేపీతో టిఆర్‌ఎస్‌కు ఏనాడూ పొత్తు లేదని స్పష్టం చేశారు.

ఓట్ల కోసం టీఆర్ఎస్ పార్టీ జూటా మాటలను చెప్పదన్నారు. గతంలో పండుగ వేళ హైదరాబాద్‌లో కర్ఫ్యూ ఉండేదని.. ప్రస్తుతం తమ ప్రభుత్వ హయాంలో అలాంటివేమీ లేవన్నారు. చంద్రబాబు ఇప్పటివరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిశారని మండిపడ్డారు. బీజేపీకి ప్రస్తుత శాసనసభలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని వారందరూ కూడా ఓడిపోతారని వచ్చే శాసనసభలో బిజెపి ఆనవాళ్లే జోస్యం చెప్పారు.

ktr

గతంలో అన్ని పార్టీలు ముస్లింలను ఓటుబ్యాంకుగా చూసేవారన్నారు. కాంగ్రెస్, టిడిపిలు 2004 నుండి 2014వ సంవత్సరం వరకు మైనార్టీల సంక్షేమం కోసం 2000 కోట్ల రూపాయలు కేటాయిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం గత నాలుగేళ్లలో 2000 కోట్ల రూపాయలు కేటాయించి ముస్లింల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పేద ముస్లింల కోసం డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు.

- Advertisement -