చంద్రబాబు అరుపులు, కేకలు ఫలించలేదు:కేటీఆర్

407
KTR chandrababu
- Advertisement -

ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాబు తన ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని చెప్పిన ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..ఈసీ విఫలమైందని చెప్పాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబు, ఎల్లో మీడియా చేస్తున్న యత్నాలే నిదర్శనం అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

చంద్రబాబు, టీడీపీ నేతల మాటలు చూస్తుంటే ఎన్నికల్లో వారికి ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయని తెలిపారు కేటీఆర్. ఎల్లో మీడియాతో కలిసి ఎన్నడూ లేనంత హంగామా చేస్తోందని నాటకాన్ని రక్తి కట్టించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కానీ, ఇవేవీ ఆ పార్టీని కాపాడలేవంటూ వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై సెటైర్లు వేశారు కేటీఆర్.

ఇక తెలంగాణలో పోలింగ్ సరళిపై స్పందించిన కేటీఆర్ తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఓటేసేందుకు ఆసక్తి చూపించారని చెప్పారు. అధికార యంత్రాంగం, ఈసీ, ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీల కార్యకర్తలను చూస్తే గర్వంగా ఉందన్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తగ్గడం మాత్రం బాధించిందని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

- Advertisement -