కష్టకాలంలో నేతన్నలకు ప్రభుత్వ చేయూత: కేటీఆర్

389
- Advertisement -

ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలోని నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం మరో ప్రత్యేకమైన చర్య తీసుకున్నట్లు తెలంగాణ పరిశ్రమలు మరియు టెక్స్టైల్ శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ మరియు లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని నేతన్నల వద్ద మరింత నగదును పెంచే ఉద్దేశంతో గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన నేతన్నకు చేయూత పథకాన్ని లో భాగంగా గడువు పూర్తి కాకముందే నేతన్నలకు నగదు సాయం అందించేందుకు ఈరోజు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

ప్రస్తుతం ఉన్న గడువు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేతన్నకు చేయూత పొదుపు పథకానికి సంబంధించి పథకంలో చేరిన నాటి నుంచి లాకిన్ పీరియడ్ ఉంటుందని, అయితే ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే నేతన్నలు ఈ పథకం నుంచి నగదు అందుకునే సౌలభ్యాన్ని కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సౌకర్యం కల్పించడంతో నేతన్నలకు సుమారు 93 కోట్ల రూపాయలు అందుబాటులోకి వస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. గతంలో ఈ పథకంలో భాగంగా చేనేత కార్మికులు ఎనిమిది శాతం తమవాటా జమ చేస్తే దానికి రెట్టింపు 16 శాతం ప్రభుత్వ వాటా నేతన్నకు చేయూత కార్యక్రమంలో భాగంగా జమ చేసేద అన్నారు. దీంతోపాటు పవర్లూమ్ కార్మికుల 8 శాతం నేతన్నల వాటాకు సమానంగా మరో ఎనిమిది శాతం ప్రభుత్వం జమ చేసేది. మూడు సంవత్సరాల పాటు ఈ పథకానికి లాకిన్ పీరియడ్ ఉన్నది.

ఇప్పటిదాకా కార్మికులు సుమారు 31 కోట్ల రూపాయలు జమ చేస్తే ప్రభుత్వ వాటాగా 62 కోట్ల రూపాయలను అదనంగా జమ చేసిందన్నారు. ఈ మినహాయింపు ద్వారా తక్షణమే 26500 మంది నేతన్నలకు ఉపశమనం లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపు తో ఈ పథకంలో భాగస్వాములైన నేతన్నలకు 50 వేల నుంచి సుమారు లక్షా 25 వేల వరకు నగదు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీంతోపాటు సొసైటీల పరిధిలో ఉన్నటువంటి కార్మికులకు గతంలో ముగిసిన పొదుపు పథకం యొక్క డబ్బులను చెల్లించడం ద్వారా మరో కోటి 18 లక్షల రూపాయలు నేతన్నలకు అందించనున్నట్లు తెలిపారు. ఈ డబ్బులు సుమారు 2337 మంది కార్మికులకు అందుతాయన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలకు ముందు నుంచి అండగా ఉంటూ వస్తున్నదని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడంతో పాటు,వారి ఉత్పత్తులకు డిమాండ్ కల్పించే దిశగా అనేక కార్యక్రమాలను తీసుకున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆపత్కాలంలో నూ నేతన్నలను ఆదుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే అన్ని పరిస్థితులు సర్దుకుంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సమావేశం సందర్భంగా మంత్రి బతుకమ్మ చీరల ఉత్పత్తి ప్రక్రియను పురోగతిని సమీక్షించారు. ఈరోజు టీ ఎస్ ఐ ఐ సి కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి పరిశ్రమల శాఖ పైన సమీక్షించారు. ఈ సమావేశంలో వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తో పాటు హైదరాబాద్ ఫార్మా సిటీ నీ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో ఏరోస్పేస్ డిఫెన్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పరిశ్రమల శాఖ లోని పలు విభాగాల వారీగా సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్ష సమావేశంలో టీ ఎస్ ఐ ఐ సి చైర్మన్ బాలమల్లు తోపాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, చేనేత మరియు జౌళి శాఖ డైరెక్టర్ శైలజ రామయ్యార్ మరియు వివిధ విభాగాల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

trs

- Advertisement -