పోతిరెడ్డిపాడు పాపం కాంగ్రెస్‌దే: కేటీఆర్

190
ktr
- Advertisement -

పోతిరెడ్డిపాడుపై మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్… పోతిరెడ్డిపాడు జీవో ఇచ్చింది నాటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.

ఆనాడు కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే కళ్లప్పగించి చూస్తూ హారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఇన్ని నీళ్లను చూసి ప్రతిపక్షాలకు కళ్లు మండుతున్నాయని…. సీఎం కేసీఆర్‌ ఉన్నంత వరకు రైతులకు అన్యాయం జరగదన్నారు.

ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అని ఆయన తెలిపారు. ఎండాకాలంలోనూ నీళ్లు అందిస్తున్న కాళేశ్వరంపై కూడా విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -