మిషన్ భగీరథతో ఫ్లోరైడ్‌కు చెక్‌: కేటీఆర్‌

509
ktr
- Advertisement -

మిషన్ భగీరథ పథకంతో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌కు చెక్ పెట్టామని తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్ చేసిన కేటీఆర్ ఎంతో ముందుచూపు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో అత్యంత సురక్షితమైన మంచినీటిని ప్రజలకు అందిస్తున్నారని చెప్పారు.

మిషన్ భగీరథ టీంకు,ఇంజనీరింగ్ అధికారులకు ఈ క్రెడిట్ దక్కుతుందన్నారు. నల్గొండ జిల్లాలో గత ఆరేళ్లుగా ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు కేటీఆర్.

- Advertisement -