కేంద్ర మంత్రితో ముగిసిన కేటీఆర్ భేటీ..

510
minister ktr
- Advertisement -

మంగళవారం మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో భటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి స్మృతి ఇరానీని మంత్రి కేటీఆర్‌ శాలువాతో సన్మానించారు. కాగా కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది.

ఈ సమావేశంలో వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధికి సహాయం అందించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అలాగే సిరిసిల్లలో ఉన్న టెక్స్‌టైల్ పార్క్, వీవింగ్ పార్క్, అపెరల్ పార్కులను కవర్ చేయడానికి సమగ్ర పవర్‌లూమ్ క్లస్టర్ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద సిరిసిల్ల వద్ద మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు.

IT Minister KTR Meets Union Minister Smriti Irani in New Delhi and Explains Her about Handloom Sector …

- Advertisement -