హుజుర్ నగర్ కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ సమావేశం

306
ktr
- Advertisement -

సూర్యపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్. ఇటివలే హుజుర్ నగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ది శానంపూడి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు కార్యకర్తలకు కృతజ్నతలు తెలిపారు. హుజుర్ నగర్ అభివృద్దికి సహకరించాలని కోరారు. త్వరలోనే హుజుర్ నగర్ లో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ktr new

ఈ సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్ వినయభాస్కర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శాసన మండలి విప్ భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యే హరిప్రియ, భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, సైదిరెడ్డి, నోముల నర్సింలు ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -