కూకట్‌పల్లిలో కేటీఆర్‌…100 కోట్లతో అభివృద్ధి పనులు

522
ktr
- Advertisement -

మంత్రి కేటీఆర్ కూకట్‌పల్లిలో పర్యటించారు. రూ. 100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపన,ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన ఇండోర్ స్టేడియంను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ జీహెచ్‌ఎంసీ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

స్థానిక క్రీడాకారులు ఈ స్టేడియాన్ని వినియోగించుకోవాలని, తద్వారా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు కేటీఆర్. స్థానిక క్రీడాకారులకు ఈ స్టేడియం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నగర యువత షటిల్ బ్యాడ్మింటన్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నందున ఈ స్టేడియంను నిర్మించినట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు స్థానిక కార్పోరేటర్లు, క్రీడాకారులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ktr for kukatpally to inagurate rs 100 crores work ktr for kukatpally to inagurate rs 100 crores work

- Advertisement -