జేపీ నడ్డా కాదు..అబద్దాల అడ్డాః కేటీఆర్

405
ktr Kukatpalli
- Advertisement -

బీజేపీ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జేపీ నడ్డా ఎవరో రాసిచ్చిన స్క్రీప్ట్ ను చదివారని.. నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌.. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆయన జేపీ నడ్డా కాదని… పచ్చి అబద్ధాల అడ్డా అని ఎద్దేవా చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేసేవారు దమ్ముంటే వాటిని నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. హైదరాబాదుకు ప్రధాని మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి, ఆ చలిమంటల్లో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

ktr

బీజేపీ వాళ్లు ఎదో పెద్దగా ఉహించుకుంటున్నారని..వాళ్లను ఎవరు పట్టించుకోవద్దని చెప్పారు. తెలంగాణ అడ్డాలో బీజేపీ నడ్డా నాటకాలు నడవవు. ఇతర రాష్ర్టాల్లో వేసిన ఎత్తుగడలు తెలంగాణలో వేస్తే ఊరుకోం. బీజేపీ నేతలు అధికార మత్తులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. కర్ణాటకలో బీజేపీ చేసిన నాటకాలు ఇక్కడ సాగవు. ఇది కర్ణాటక కాదు.. తెలంగాణ అని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా 24గంటల కరెంట్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఆడబిడ్డలకు కళ్యాణ్ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్నామని చెప్పారు. బీజేపీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప వాళ్లు చేసిందేమి లేదన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో ఎక్కడైనా కర్ఫ్యూ పెట్టే పరిస్థితి వచ్చిందా? సంక్షేమ కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా? వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలకు కరెంటు ఇస్తున్నాంమని చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు 50లక్షల మంది టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్నారు. క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలే టీఆర్‌ఎస్‌ బలం అని చెప్పారు.

- Advertisement -