హైదరాబాద్ గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్‌: కేటీఆర్

556
ktr
- Advertisement -

హైదరాబాద్ గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్‌కి వేదిక అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో రెండో రోజు వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ హైదరాబాద్‌లో తొలిసారి వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉందన్నారు.

ఐటీ రంగంలో బెంగళూరు కంటే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఔత్సాహికులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. హైదరాబాద్‌లో టీ-హబ్, టీ-వర్క్స్, ఇమేజ్ టవర్స్ నిర్మాణం జరుగుతుందన్నారు.

తెలంగాణ టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతుందని….హైదరాబాద్ గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ కాబోతుందన్నారు. పద్మశ్రీ చింతకింది మల్లేషం తయారు చేసిన ఆసు యంత్రాలను చేనేత కళాకారులకు మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సమావేశాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.

- Advertisement -