మొక్కలు నాటిన కొత్తగూడెం కలెక్టర్ రజత్ కుమార్

323
Rajath kumar
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. పలువురు సినీ, రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో చాలా చురుకుగా పాల్గోంటున్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ శైని. కొత్తగూడెం కలెక్టర్ బంగ్లా ఆవరణలో జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ శైని 3 మొక్కలు నాటారు.

Collector Rajath Kumar

ఈ సందర్భంగా కలెక్టర్ రజత్ కుమార్ శైని మాట్లాడుతూ..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా ముఖ్యమైన కార్యక్రమమన్నారు. దీనిని ప్రారంభించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. మొక్కలు నాటడమనే ప్రక్రియ చాలా ముఖ్యమైంది. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలి. మరో ముగ్గురికి మూడు మొక్కలు నాటమని ఛాలెంజ్ ఇవ్వడం దేశవ్యాప్తంగా వ్యాపించిందని అన్నారు. దీనివల్ల దేశంలో విరివిగా మొక్కలు పెరిగి, వాతావరణ సమతుల్యతను ఏర్పరుస్తాయని అన్నారు. జిల్లాలో విస్తృతంగా హరితహారం కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా ఎస్పీ, ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ లకు మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసిరారు.

- Advertisement -