కార్యకర్తలతో కోమటిరెడ్డి భేటీ..బీజేపీలో చేరిక లాంఛనమే..!

416
komatireddy
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ ఆయన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.బుధవారం అర్థరాత్రి వరకు ముఖ్య నాయకులతో సమావేశమైన రాజగోపాల్ రెడ్డి..పార్టీ మారాలనే నిర్ణయాన్ని వారితో వెల్లడించినట్లు సమాచారం.దీంతో పాటు ఇవాళ హైదరాబాద్ శివారు పెద్ద అంబర్‌ పేటలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమానికి మునుగోడు నేతలతో పాటు ఉమ్మడివరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలకు ఆహ్వానాలు అందాయి. టీపీసీసీ పదవి తమకు వచ్చే అవకాశం లేదని బీజేపీలో మంచి అవకాశాలు వస్తాయని అనుచరులతో రాజగోపాల్‌రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఇవాళ జరిగే సమావేశంలో బీజేపీలో ఎందుకు చేరాలనుకుంటున్నాను అనే దానిపై వివరణ ఇవ్వనున్నారు. ఇక మరోవైపు తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని రాజగోపాల్ కార్యకర్తలతో చెప్పినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న రాజగోపాల్‌రెడ్డి ఇవాళ పెద్ద అంబర్‌పేట్‌లో నిర్వహించే సమావేశం ద్వారా ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పనున్నట్లు సమాచారం.

- Advertisement -