పోరాడి ఓడిన పంజాబ్..కోల్ కత్తా రెండో విజయం

264
kolkatta
- Advertisement -

 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నిలో ఆడిన రెండు మ్యాచల్ లలో విజయం సాధించింది. ఆండ్రూ రసెల్ మెరుపు షాట్లతో పంజాబ్ కు ముచ్చెమటలు పట్టించాడు. 3ఫోర్లు , 5సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన రసెల్ 34బంతుల్లో 63 పరుగులు సాధించాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా నిర్ణిత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. కోల్ కత్తా ఓపెన్లు సునీన్ నరైన్ 24పరుగులు, లిన్ 10 పరుగుల వద్ద అవుట్ కాగా ఆ తర్వాత గ్రీస్ లోకి వచ్చిన రాబిన్ ఉతప్ప చెలరేగిపోయాడు.

ఉతప్ప 50 బంతుల్లో 67పరుగులు చేశాడు. ఉతప్ప, రసెల్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. వరుస ఫోర్లు, సిక్సర్లతో పంజాబ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. పంజాబ్ బౌలర్లలో షమి, వరుణ్ చక్రవర్తి, విల్జోయెన్ , మన్ దీప్ సింగ్ లు తల ఒక వికెట్ ను తీశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణిత 20ఓవర్లలో 190పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. మయాంక్ 34బంతుల్లో 58పరుగులు చేయగా, మిల్లర్ 40బంతుల్లో 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

- Advertisement -