ఉప్పల్‌లో కోహ్లీ సునామీ…బెంబేలెత్తిన విండీస్

509
virat
- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ విశ్వరూపం చూపించాడు. ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విరాట్ ధాటికి భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. తొలి బంతి నుంచే విండీస్ బౌలర్లపై విరుచుకపడ్డ కోహ్లీ కసితీరా ఆడాడు. కోహ్లీ వీరవిహారంతో మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. కోహ్లీ (50 బంతుల్లో 94 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) కి తోడుగా రాహుల్(62) పరుగులు చేయడంతో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

అంతకముందు టాస్ గెలిచన కోహ్లీ…విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.ర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. హెట్‌మైర్ (41 బంతుల్లో 56; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకం సాధించగా.. ఎవిన్ లూయిస్ (17 బంతుల్లో 40; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్ (19 బంతుల్లో 37; 1 ఫోర్, 4 సిక్సర్లు), బ్రాండన్ కింగ్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులు మెరిపించారు.

కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య తదుపరి మ్యాచ్ తిరువనంతపురంలో ఆదివారం జరుగనుంది.

India cruised to a 6-wicket victory over West Indies in Hyderabad to go 1-0 up in the 3-match T20I series, Friday

- Advertisement -