ఖమ్మంలో భారీగా పాతనోట్లు పట్టివేత

456
police
- Advertisement -

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మల్లపాడులో రద్దైన రూ.500.రూ.1000 నోట్లను పట్టుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కల్లూరు ఏసీపీ వెంకటేష్ ..పట్టుబడ్డ నోట్ల డంప్ ఇటీవల దొంగనోట్ల వ్యవహారం లో కీలకం గా వ్యవహరించిన సత్తుపల్లి మండలం గౌరీ గూడెం కు చెందిన మధార్ ముఠాకు చెందినదిగా గుర్తించామన్నారు.

తమ వద్ద సుమారు 100 కోట్ల రూపాయల విలువ గల పాత నోట్లు ఉన్నాయని పెద్ద డంప్ గా ఏర్పాటుచేసి నోట్ల కట్టల్లో పైనా కింద పాత 500,1000 నోట్లు మధ్యలో చిత్తుకాగితాలు పెట్టి మదార్ ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు.

మర్లపాడు గ్రామంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తామని ఇంటిని అద్దెకు తీసుకుని ఈ ముఠా నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారని తెలిపారు. పాత నోట్లు,దొంగ నోట్లు మార్పిడికి మధార్ కు సహాయ పడుతున్న గాయం వెంకటనారాయణ, చౌడవరం గ్రామం వేంసూరు మండల, కోట హనుమంతరావు గండుగులపల్లి గ్రామం దమ్మపేట మండలం కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

police

- Advertisement -