సీఎం కేసీఆర్‌తో కేకే,పువ్వాడ భేటీ

518
puvvada ajay
- Advertisement -

సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు ఎంపీ కేశవరావు,మంత్రి పువ్వడ అజయ్. ప్రగతి భవన్‌కు చేరుకున్న వీరిద్దరు ఆర్టీసీ సమ్మెపై విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ జేఏసీతో చర్చలకు తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని కేసీఆర్‌తో కేశవారావు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలకు హైకోర్టు విధించిన డెడ్‌లైన్‌ శుక్రవారంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో కేకే భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగరంలోని రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష నిర్వహించారు. సమ్మె నేపథ్యంలో తీసుకుంటున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మాట్లాడారు.

- Advertisement -