ఒకే వేదికపై సీఎంలు కేసీఆర్,జగన్‌

405
kcr jagan
- Advertisement -

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శనివారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 6.50 గం టలకు మొదలుకానున్న ఇఫ్తార్ విందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోపాటు వివిధ రంగాల ప్రముఖులు, ముస్లింలు హాజరుకానున్నట్లు రాజ్‌భవన్‌వర్గాలు తెలిపాయి.

ఇక జూన్ 2న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్. ఇందుకోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రంజన్ సందర్భంగా పేద ముస్లింలకు 4.50 లక్షల గిఫ్ట్ ప్యాకులను పంపిణీ చేయనుంది సర్కార్‌. గిఫ్ట్‌ప్యాకులో ఒక చీర, సల్వార్ కమీజ్, కుర్తా పైజామా, ఒక బ్యాగు ఉంటాయి. ముస్లింలలో అత్యంత పేదవారిని గుర్తించి వీటిని అందజేయనున్నారు.

ఒక్కో మసీదు ద్వారా 500 మందికి చొప్పున జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎంపికచేసిన 448 మసీదుల్లో మొత్తం 2.24 లక్షల గిఫ్ట్ ప్యాకులను పంపిణీ చేయనున్నారు. మిగిలిన జిల్లాల పరిధిలో ఎంపికచేసిన 367 మసీదులతోపాటు 17 రిజర్వ్ మసీదులను కలుపుకొని 384 మసీదుల్లో 1.92 లక్షల గిఫ్ట్ ప్యాకులను అందజేస్తారు. ఇఫ్తార్ విందు కోసం మసీదుకు రూ.1 లక్ష ఏటా ప్రభుత్వం దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.

- Advertisement -