శారదా పీఠాధిపతులకు సీఎం కేసీఆర్ పుష్పాభిషేకం

547
cm kcr
- Advertisement -

శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, ఇటీవల శారదా పీఠ ఉత్తరాధికారిగా నియమితులైన స్వాత్మానందలకు సీఎం కేసీఆర్ ఇవాళ పుష్పాభిషేకం చేయనున్నారు.జలవిహార్లో సీఎం చేతుల మీదుగా స్వాములకు అభిషేకం జరగనుంది.

బుధవారం సాయంత్రం 5 గంటలకు పుష్పాభిషేకంతో పాటు స్వాత్మానందేంద్ర స్వామి పరిచయ కార్యక్రమం ఉంటుంది. తెలంగాణాలోని అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున కట్టు, బొట్టుతో తరలిరానున్నారు. సీఎం కేసీఆర్ ఏ పనిచేసినా శారదా పీఠాధిపతి ఆశీస్సులు ఉండాల్సిందే.

అసెంబ్లీ ఎన్నికల ముందు రాజశ్యామల యాగం నిర్వహించి, కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డారు. ఇటీవల శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్వాములకు పుష్పాభిషేకం నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

- Advertisement -