గులాబీ బాస్ ప్రచారానికి ముహుర్తం ఫిక్స్‌..!

185
kcr elections campaign
- Advertisement -

ఎన్నికల ప్రచారంలో వేడిని పెంచింది టీఆర్ఎస్. ఇప్పటికే మంత్రి కేటీఆర్,హరీష్ రావు పలు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గులాబీ బాస్,సీఎం కేసీఆర్ ప్రచారానికి తేదీలు ఖరారైనట్లు తెలుస్తోంది.

రెండు రోజుల్లో ఆరు సభల్లో పాల్గొనేలా ప్రణాళికను సిద్ధం చేశారు. నవంబర్ 19, 20 తేదీల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. ఈ నెల 19న ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు సంబంధించి సభను ఖమ్మంలో , సాయంత్రం నాలుగుగంటలకు పాలకుర్తి సభలో పాల్గొననున్నారు కేసీఆర్.

Related image

20వ తేదీ సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలను ఉద్దేశించి సిద్దిపేట,సిరిసిల్ల,వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించి సిరిసిల్లలో జరిగే సభలో పాల్గొనున్నారు. దీంతో పాటు కరీంనగగ్ జిల్లా హుజురాబాద్,కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. కేసీఆర్ ప్రచారంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపనుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -