రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. ఎల్లుండి మోదీతో భేటీ

336
cm kcr modi
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 11.30గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈసందర్భంగా రేపు సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

రాష్ట్రానికి ఇచ్చే నిధులు పెంచాలని ప్రధాని కోరనున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సాయం చేయాలని కోరనున్నారు. అలాగే విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించాలని , రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా ఒక ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని కోరె అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

- Advertisement -