మొదటి రోజు నుంచే పాలన షురూ కావాలె…

210
- Advertisement -

కొత్తగా ఏర్పాటయ్యే ప్రతీ జిల్లా కేంద్రంలో మొదటి రోజు నుంచి కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు పనిచేయాలని, అదే విధంగా కొత్తగా ఏర్పాటయ్యే మండలాల్లో కూడా పోలీస్ స్టేషన్లు, మండల రెవిన్యూ కార్యాలయాలు పనిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వీలైనంత వరకు ప్రతీ రెవిన్యూ డివిజన్లో ఆర్జిఓ తో పాటు డిఎస్పీ స్థాయి అధికారి ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చేపట్టాల్సిన అధికారిక కసరత్తుపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష జరిపారు. మంత్రులు టి.హరీష్ రావు, కె.తారకరామారావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మిషన్ భగీరధ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ సిఎంఒ ముఖ్య కార్యదర్పులు నర్సింగ్ రావు, శాంతకుమారి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

unnamed (1)

17 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముసాయిదాలో ప్రకటించామని, ఇవి కాకుండా జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు కూడా పరిశీలనలో వుందని, వీటికి తోడు కొత్త డివిజన్లు, మండలాలు కూడా ఏర్పాటవుతున్నందున అన్ని చోట్ల అధికారుల నియామకం, కార్యాలయాల ఏర్పాటు తదితర విషయాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంకా కొత్త రెవిన్యూ డివిజన్లు, మండలాలకు సంబంధించి ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధుల వినతితో ముఖ్యమంత్రి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

  1. సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి పోలీసు శాఖను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న కరీంనగర్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లతో పాటు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కు సంబంధించి కూడా ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.
  2. సిద్దిపేట, మెదక్ జిల్లాల ప్రారంభ కార్యక్రమంలో తాను పాల్గొంటానని ముఖ్యమంత్రి చెప్పారు. మిగిలిన మంత్రులు, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్చి తలా ఒక జిల్లాను ప్రారంభించాలని సిఎం సూచించారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పరిధిలో ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్లు, మండలాలను ప్రారంభించాలని చెప్పారు. ఎవరు ఎక్కడ ఏ కార్యాలయాన్ని ప్రారంభించాలో జాబితా తయారు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.
  3. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో పని చేయడానికి ఉద్యోగుల విభజన వెంటనే పూర్తి చేయాలని, అవసరమైన పక్షంలో డిపిసిలు నిర్వహించి పదోన్నతులు కల్పించాలని సిఎం చెప్పారు.
  4. యాదాద్రి జిల్లాను రాచకొండ పోలీస్ కమిషనరేట్లో, జనగామ జిల్లాను వరంగల్ పోలీస్ కమీషనరేట్లలో భాగం చేయాలని సిఎం చెప్పారు. కొమరం భీమ్ పుట్టిన జోడెన్ గాడ్ కొత్తగా ఏర్పాటు చేసే ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆసిఫాబాద్ జిల్లాకే కొమరంభీమ్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
  5. ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ ను, మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరును, రంగారెడ్డి జిల్లాలోని తాండూరును రెవెన్యూ డిజిన్లుగా మార్చాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.
  6. ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త రెవెన్యూ డివిజన్ ప్రారంభించాలని నిర్ణయించినందున, ప్రజలందరకీ అందుబాటులో ఉండే విధంగా భైంసాలో రెవెన్యూడివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సిఎం చెప్పారు.
  7. గజ్వెల్ నియోజకవర్గంలోని ములుగు మండలంలో మార్కూక్, తూప్రాన్ మండలంలో మనోహరాబాద్, నిజామాబాద్ జిల్లాలో చందూరు, ములుగు నియోజకవర్గంలో కన్నాయిగూడెం, నిర్మల్ అర్బన్, రూరల్ మండలాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
  8. నాగిరెడ్డి పేట మండలాన్ని కామారెడ్డి జిల్లాలో కొనసాగించాలని నిఘా వర్గాలు జరిపిన సర్వేలో తేలిందని సిఎం చెప్పారు. కాబట్టి ఆ మండలాన్ని కామారెడ్డిలో కొనసాగించాలని, అమసరమైతే మెదక్ కు సమీపంలో ఉన్న ఆ మండల పరిధిలోని గ్రామాలను మెదక్ జిల్లాలో కలపాలని చెప్పారు.
  9. మొూయినాబాద్, శంకరపల్లి, శాబాద్ లతో పాటు చేమేళ్ల మండలాన్ని కూడా రంగారెడ్డి (శంషాబాద్) జిల్లాలోనే చేర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
  10. కల్వకుర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలుస్తున్నందున ఆ నాలుగు మండలాలను సైబారాబాద్ పోలీస్ కమీషనరేట్‌ పరిధిలో మార్చాలని సిఎం చెప్పారు.
- Advertisement -