సింగాయపల్లిలో మొక్కను నాటిన సీఎం కేసీఆర్

509
kcr singayapally
- Advertisement -

గజ్వేల్ పర్యటనలో భాగంగా సిద్దిపేట జిల్లా సింగాయపల్లిలో మొక్కను నాటారు సీఎం కేసీఆర్. కలెక్టర్లు,మంత్రులతో కలిసి సింగాయపల్లి వద్ద అటవీ పునరుద్దరణ పథకం కింద 15 వందల ఎకరాల్లో పెంచిన అటవీ ప్రాంతం, ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు సీఎం. అటవీ పునరుద్దరణ వివరాలను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు ఫారెస్ట్ అధికారులు.

అనంతరం గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల్లో 456 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరందించేందుకు గజ్వేల్‌ మండలం కోమటిబండగుట్టపై నిర్మించిన మిషన్‌ భగీరథ సంప్‌హౌస్‌ను సందర్శించనున్నారు. జిల్లా కలెక్టర్లు,మంత్రులతో ఇక్కడ సమావేశం కానున్నారు.

రెవెన్యూ సంస్కరణలతో పాటు హరితహారం, మిషన్‌ భగీరథలపై కలెక్టర్లకు వివరించనున్నారు. కోటి 40 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఈ భారీ సంప్‌హౌస్‌ నుంచి నిత్యం నీటి సరఫరా జరుగుతోంది. సంప్‌హౌస్‌ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన మిషన్‌ భగీరథ నాలెడ్జ్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

- Advertisement -