ముంబైకి సీఎం కేసీఆర్..

477
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ ముంబై బయల్దేరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను ఆహ్వానించేందుకు బేగంపేట నుంచి ముంబై బయల్దేరి వెళ్లారు.

మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర సీఎం అధికార నివాసానికి చేరుకుంటారు. అనంతరం కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఇక త్వరలోనే విజయవాడకు వెళ్లి ఏపీ సీఎం జగన్‌ను సైతం ఆహ్వానించనున్నారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

నదికే నీళ్ళనిచ్చే జీవనదిగా మారనుంది కాళేశ్వరం . 1832 కిలోమీటర్‌ల పొడవునా, 190 టీఎంసీల గోదావరి జలాలను ఎతిు పోస్తూ 20 జిల్లాలకు ఉపయోగపడే లా డిజైన్ అయి 37లక్షల ఎకరాలకు సాగునీరందించనున్నారు.

- Advertisement -