గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన కామారెడ్డి జిల్లా కలెక్టర్

372
Collector Satyanarayanan
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అద్బుతమైన స్పందన వస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కామారెడ్డి కలెక్టర్ ఎన్.సత్యనారాయణ నేడు మొక్కలు నాటారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సతిమణి గంగాభవనితో కలిసి మూడు మొక్కలు నాటారు. ఈసందర్భంగా మరో నలుగురికి మొక్కలు నాటాల్సిందిగా ఆయన సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు కామారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్.శ్వేత , జిల్లా స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్ ధోత్రే ,అసిస్టెంట్ కలెక్టర్ తేజర్ నందలాల్ పవార్ కి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్. సత్యనారాయణ మాట్లాడుతూ.. గ్రీన్ ఛాలెంజ్ మంచి కార్యక్రమం అని ఇందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్ ని అభినందిస్తూ ఇందులో పాల్గొన్నందుకు నాకు సంతోషంగా ఉందన్నారు. అలాగే గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటి వరకు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 400 మొక్కలు నాటడం జరిగిందని, గణతంత్ర దినోత్సవం లోపు 4 వేల మొక్కలను నాటుతామని తెలిపారు.

- Advertisement -